దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు నుంచి పార్టీని, అధికారాన్ని చంద్రబాబు ఎలా లాక్కున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.చంద్రబాబు సీఎం అయ్యాక నందమూరి కుటుంబంలో ఒక్కొక్కళ్లను చాలా తెలివిగా వాడుకుంటూ సైడ్ చేసుకుంటూ వచ్చారు.
ముందుగా ఎన్టీఆర్ను గద్దె దించేందుకు పురందేశ్వరి, వెంకటేశ్వరరావు దంపతులను వాడుకుని వాళ్లను సైడ్ చేసేశారు.ఆ తర్వాత హరికృష్ణను వాడుకుని పక్కన పెట్టి పార్టీ వరుసగా రెండుసార్లు ఓడాక కాని ఆయనకు రాజ్యసభ ఇవ్వలేదు.
ఇక ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి ఒక్క బాలయ్య మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు.బాలయ్య పేరుకు మాత్రమే ఎమ్మెల్యే తప్పా ఆయన బాబుకు వియ్యంకుడు.ఆయన వల్ల రాజకీయంగా ఒరిగేది కూడా లేదు.తాజాగా పార్లమెంటరీ పార్టీ కమిటీలు, రాష్ట్ర కమిటీలు చూస్తే మరోసారి చంద్రబాబు నందమూరి ఫ్యామిలీకి చక్కటి పోటు పొడిచారనే చర్చలే వినిపిస్తున్నాయి.
హరికృష్ణను వాడుకున్నన్ని రోజులు వాడుకుని పక్కన పెట్టిన చంద్రబాబు ఆ తర్వాత ఆయన కుమార్తెను గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్పల్లిలో నిలిపి మరీ ఓడేలా చేశారు.
ఆ తర్వాత ఆమెను పట్టించుకోలేదు.సుహాసినికి ఏపీలో అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు ఉన్నా ఇప్పుడు కూడా ఆమెకు ఏపీలో పదవి ఇస్తే తన కుమారుడు లోకేష్కు ఎక్కడ పోటీ వస్తుందో ? అని ఆమెకు తెలంగాణ పార్టీ ఉపాధ్యక్షురాలి పదవితో సరిపెట్టారు.తెలంగాణలో పార్టీకి జనాలే లేనప్పుడు ఏ పదవి ఇస్తే ఉపయోగం ఏంటి ? ఇక ఏపీలో బాలయ్యకు తప్ప నందమూరి కుటుంబంలో ఎవ్వరికి ఏ పదవి కూడా ఇవ్వలేదు.
వాస్తవానికి నిజంగా హరికృష్ణ కుటుంబంపై చంద్రబాబుకు ప్రేమ ఉంటే సుహాసినికి ఏపీలో మహిళా విభాగం బాధ్యతలు ఇవ్వడమో లేదా ఆమెకు ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం గుడివాడ లేదా రాజమహేంద్రవరం లోక్సభ నియోజకవర్గ పగ్గాలో ఇస్తే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఏపీలో ఇప్పటికే చంద్రబాబు, లోకేష్, బాలయ్య, లోకేష్ తోడళ్లుడు శ్రీ భరత్ ఇలా తన అనుకున్న వాళ్లకే పదవులు / సీట్లు ఇస్తోన్న చంద్రబాబు నందమూరి కుటుంబాన్ని ఎలా బలి చేస్తున్నారో తాజా పదవుల విషయంలో మరోసారి రుజువు అయ్యింది.