నందమూరి ఫ్యామిలీని అవసరాలకు చంద్రబాబు ఎలా వాడుకుని తర్వాత సెలైంట్గా సైడ్ చేసేస్తారో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఎన్టీఆర్ను సీఎం పీఠం నుంచి గద్దె దింపినప్పటి నుంచి చంద్రబాబుకు గుర్తు వచ్చినప్పుడు అల్లా ఆ ఫ్యామిలీని దగ్గరకు తీసుకుని తర్వాత వారిని పక్కన పెట్టేస్తారు.2004 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయాక కాని ఆయనకు నందమూరి ఫ్యామిలీ గుర్తుకు రాలేదు.ఆ తర్వాత ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణను రాజ్యసభకు పంపారు.
చివరకు 2014 ఎన్నికల్లో హరికృష్ణ రాష్ట్ర విభజన నిరసిస్తూ తన ఎంపీ పదవిని వదులుకున్నారు.
ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్తో ప్రచారం చేయించుకున్న బాబు బాలయ్య ఒత్తిడితో ఎన్టీఆర్ను పక్కన పెట్టేసి 2014 ఎన్నికలకు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీబతిమిలాడుకుని ఆయనతో ప్రచారం చేయించుకున్నారు.ఎన్టీఆర్ను పక్కన పెట్టడంతో పాటు నానా రకాలుగా అవమానించారు.2014 ఎన్నికల్లో హరికృష్ణ కృష్ణా జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ సీటు కావాలని అడిగితే బాబు తన వియ్యంకుడు బాలయ్యకు హిందూపురం సీటు ఇచ్చి హరికృష్ణ కుటుంబాన్నే పక్కన పెట్టారు.
మళ్లీ ఆయనకు 2018 తెలంగాణ ఎన్నికల్లో హరికృష్ణ మృతి తర్వాత ఆ కుటుంబాన్ని వాడుకోవాలన్న విషయం గుర్తుకు వచ్చింది.ఆ ఎన్నికల్లో హరి తనయ సుహాసినిని కూకట్పల్లిలో పోటీ చేయగా ఆమె ఓడిపోయాక ఆ కుటుంబాన్ని మర్చిపోయారు.
ఇక ఇప్పుడు మరోసారి నందమూరి ఫ్యామిలీకి, ఎన్టీఆర్కు చంద్రబాబు బిస్కెట్ వేస్తున్నాడన్న గుసగుసలు వస్తున్నాయి.టీడీపీకి, చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా మారిన మంత్రి కొడాలి నాని నందమూరి అడ్డా గుడివాడలో పాతుకుపోయారు.
ఇప్పుడు నందమూరి హరికృష్ణ ఫ్యామిలీతో పాటు ఇటు జూనియర్ ఎన్టీఆర్కు బిస్కెట్ వేసే క్రమంలోనే చంద్రబాబు హరి తనయుడు కళ్యాణ్రామ్ను గుడివాడ బరిలో దింపితే ఎలా ? ఉంటుందన్న ఆలోచనలో ఉన్నాడట.మరి ఈ బిస్కెట్ రాజకీయానికి కళ్యాణ్, ఎన్టీఆర్ లొంగి మళ్లీ బుట్టలో పడే ఛాన్స్ ఉందా ? అన్నది సందేహమే.?
.