హైద్రాబాద్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ బ్యాడ్మింటన్లో గెలుపొందిన ప్రతీసారి విజేతలకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇస్తూ వస్తున్నాడు.ఈయన ఇప్పటికే 22 కార్లకు విజేతలకు బహుకరించాడు.
తాజాగా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో సత్తా చాటిన బ్యాడ్మింటన్ దిగ్గజం సింధుకు కొత్త మోడల్ బీఎండబ్ల్యూ కారును అక్కినేని నాగార్జున చేతుల మీదుగా అందించారు.
అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఓ వేడకలో భాగంగా నాగ్ చేతుల మీదుగా సింధు మరో కారును కైవసం చేసుకుంది.
చాముండి గిఫ్ట్గా ఇచ్చిన 22 కార్లలో 4కార్లు సింధుకే దక్కాయి.విజయం సాధించిన ప్రతిసారి ఈమెకు ఓ కారు బహుకరించారు.దాంతో మొత్తం నాలుగు కార్లను సింధు కైవసం చేసుకుంది.అంతర్జాతీయ స్థాయిలో భారత సత్తా చాటిన ప్రతీసారి సింధుకు బహుమతిగా కార్లు వస్తున్నాయి.