ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కూతురు శిరిష్మ (27) ఆత్మహత్య చేసుకోవటంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తున్న శిరిష్మ 4 సంవత్సరాల క్రితం ఓయూ కాలనీలోని ట్రయల్ విల్లాస్లో నివసించే గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థ్ ని 2016 వ సంవత్సరంలో వివాహం చేసుకోవడం జరిగింది.
ఈ దంపతులు ఇద్దరూ హైదరాబాద్ గచ్చిబౌలి లో ప్లాట్ లో నివాసం ఉంటున్నారు.
అయితే గత నాలుగు సంవత్సరాల నుండి సంతానం లేకపోవడంతో డిప్రెషన్ లోకి శిరిష్మ వెళ్లిపోవడంతో.తన గదిలో ఉరేసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది.కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.తనకి పిల్లలు లేకపోవడం పట్ల గత కొంత కాలం నుండి ఆమె ఫుల్ మనస్తాపంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఉంటే కేసును అనుమానాస్పద మృతిగా భావించి ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు విచారణ స్టార్ట్ చేశారు.