తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జెమినీ టీవీలో ప్రసారమయ్యే “చక్ర వాకం” సీరియల్ బుల్లితెర ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.అయితే ఈ ధారావాహికలో నటించిన నటీనటులకి అప్పట్లో ఏకంగా సినిమా సెలబ్రిటీలకి ఉన్నంత క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.
అయితే ఈ ధారావాహికలలో హీరోయిన్లుగా నటించిన ప్రీతి అమీన్, లిఖిత లు నటనకి స్వస్తి చెప్పి ప్రస్తుతం సినిమా పరిశ్రమకి దూరంగా ఉంటున్నారు.ఇక హీరోలుగా నటించిన ఇంద్ర నీల్, సాగర్ లు ప్రస్తుతం వెండి తెరపై, బుల్లి తెరపై హీరోలుగా రాణిస్తున్నారు.
అయితే ఈ చక్ర వాకం సీరియల్ లో నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటించి తన ఇన్నోసెంట్ నటనతో ప్రేక్షకులని బాగానే అలరించిన పావని కూడా బాగానే గుర్తుంటుంది.
అయితే నటి పావని చక్ర వాకం సీరియల్ లో నటించిన తర్వాత పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో కూడా నటించి బాగానే ఆకట్టుకుంది.
కాగా నటి పావని హైదరాబాద్ నగరంలో పుట్టి పెరిగింది.చదువు పూర్తవగానే నటనపై ఆసక్తి కలగడంతో ఇండస్ట్రీకి వచ్చింది.
దీనికి తోడు పావని తండ్రి పిల్లల కృష మూర్తి కూడా అప్పట్లో “దూరదర్శన్” చానల్ లో ప్రసారమయ్యే పలు ధారావాహికలకు దర్శకుడిగా పని చేశాడు.దీంతో పావని మరియు తన సోదరి శ్రావణి ఇద్దరూ కలసి సినిమా ఇండస్ట్రీకి ఒకేసారి పరిచయమయ్యారు.
అయితే నటి శ్రావణి తెలుగులో ప్రముఖ దర్శకుడు జక్కన్న “ఎస్.ఎస్.రాజమౌళి” దర్శకత్వం వహించిన “శాంతి నివాసం” అనే ధారావాహిక ద్వారా నటిగా పరిచయమైంది.అందువల్లనే నటి శ్రావణి ఎక్కువగా జక్కన్న సినిమాల్లో ఏదో ఒక పాత్రలో కనిపిస్తుంటుంది.
కాగా శ్రావణి సింహాద్రి చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్ర పోషించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.కానీ ప్రస్తుతం నటనకు స్వస్తి పలికి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.
అయితే నటి పావని కూడా ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాలు కరువవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది.కాగా ప్రస్తుతం ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగిని పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది.కాగా నటి పావని ప్రస్తుతం తన కుటుంభం సభ్యులతో కలసి హైదరాబాద్ లో నివాసముంటున్నట్లు సమాచారం.