అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ‘స్వామిరారా’ ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెల్సిందే.వరుసగా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ల తర్వాత చైతూ నటిస్తున్న ఈ సినిమాపై అందరి దృష్టి కేంద్రీకృతం అయ్యి ఉంది.
ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్లుక్ను కొన్ని రోజుల ముందు విడుదల చేసిన విషయం తెల్సిందే.ఫస్ట్లుక్కు మంచి స్పందనే వచ్చింది.
తాజాగా ఈ సినిమా టైటిల్ను చిత్ర దర్శకుడు శివరాత్రి సందర్బంగా ప్రకటించాడు.
‘స్వామిరారా’ తరహాలోనే ఈ సినిమా కూడా దొంగ, దొంగతనాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
దాంతో ఈ సినిమాకు ‘దోచేయ్’ అనే టైటిల్ను ఫిక్స్ చేయడం జరిగింది.క్యాచీగా ఉండటంతో పాటు మాస్ ప్రేక్షకులకు ఈ టైటిల్ బాగా నచ్చుతుంది అనే ఉద్దేశ్యంతో ఈ టైటిల్ను ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతిసనన్ హీరోయిన్గా నటిస్తోంది.బ్రహ్మానందం ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.
అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఈ సినిమా వేసవి చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.