ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న ఏకైక సమస్య కరోనా వైరస్.ఎక్కడో చైనా దేశంలో జంతువుల మార్కెట్ లో మొదలైన ఈ వైరస్ క్రమక్రమంగా ప్రపంచం మొత్తం వ్యాపించి ప్రపంచ దేశాలు కోలుకోలేని స్థితికి తీసుకువచ్చింది.
కరోనా వైరస్ కు పుట్టినిల్లయిన చైనాలో ఇప్పుడు మరో మహమ్మారి భయపెడుతోంది.ఆ దేశంలో కొత్తగా బుబోనిక్ ప్లేగు కేసులు నమోదు అవుతుండడంతో మళ్లీ ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది.
తలనొప్పి, జ్వరం, చలి, శరీరంలో అక్కడక్కడ వాపులు, గ్రంధుల్లో నొప్పి శరీరంపై కొన్ని చోట్ల పుండ్లతో బాధపడుతున్న ఓ వ్యక్తిని చైనా ఉత్తర ప్రాంతంలో వైద్యుల పరిశీలించగా ఈ ఇన్ఫెక్షన్ మూలాలు కనబడ్డాయి.దీంతో అతని కుటుంబ సభ్యులు దగ్గరి స్నేహితులు అందరిని గుర్తించి వారికి కూడా పరీక్షలు చేశారు.
ఆ తర్వాత సదరు వ్యక్తి నివసిస్తున్న ప్రాంతంలో లెవెల్ – 3 ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది చైనా ప్రభుత్వం.ముఖ్యంగా చైనా దేశానికి ఉత్తర సరిహద్దులలో ఉన్న మంగోలియా లోను ఈ కొత్త వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది.
ఇకపోతే ప్లేగు అనేది మూడు రకాలు.అందులో ఒక రకమే ఈ కొత్తరకం బుబోనిక్ ప్లేగు వైరస్.ఈ వైరస్ వ్యాప్తి చెందడానికి ముఖ్యంగా గుమ్మడి పురుగులు, ఎలుకలు వాహకాలుగా వాడుకుంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.ఎలుకలు మీద గుమ్మడి పురుగులు కుట్టడం ద్వారా మనిషి శరీరం లోకి బ్యాక్టీరియా చేరుతుందని వారు తెలుపుతున్నారు.