ప్రస్తుతం కరోనా కాలం.ఎంతోమంది ఉద్యోగాలు పోయి ఆర్ధికంగా నష్టపోయిన కాలం ఇది.ఇంకా అలాంటూ ఈ కాలంలో ఎవరు ఎలా ఉంటారో చెప్పలేని రోజులు ఇవి.ఎంతో జాగ్రత్తగా ఉండాలి.జాగ్రత్తగా లేకుంటే ఇదిగో ఇక్కడ ఉన్నా ఘటనలనే జరుగుతుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.దేశ రాజధానిలో ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ పార్ట్-1లో ఓ ఘటన చోటు చేసుకుంది.
ఆ ఘటన చూస్తే వామ్మో ఈ దొంగలకు ఎంత దైర్యం అంటూ కామెంట్ చేస్తారు.
ఢిల్లీలో రోడ్డుపై నడుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలపై చైన్ స్నాచర్లు దాడి చేశారు.దీంతో వారిలో ఒక మహిళ పారిపోవడం మరో మహిళ ప్రతిఘటించే ప్రయత్నం చేసింది.
దీంతో ఆ దొంగ బైక్ దిగి మరీ ఆమె మెడలోని చైను లాక్కెళ్లాడు.
దీంతో అదే మార్గంలో వెళ్తున్న ఓ డెలివరీ బాయ్ హెల్మెట్తో కొట్టి దొంగలను ఆపేందుకు ప్రయత్నం చేశాడు.
కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు.అయితే ఈ ఘటన అంత కూడా అక్కడే ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డ్ అయ్యింది.
దీన్ని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా వైరల్ గా మారింది.అయితే ఢిల్లీలో రోజు రోజుకు ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి.