ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన హీరో కార్తికేయ.ఈ సినిమా తర్వాత కార్తికేయ చాలా సినిమాలు చేసిన ఆర్ఎక్స్ బ్రాండ్ ని మాత్రం చేరపలేకపోయాయి.
దీంతో ఇప్పటికే అదే సినిమా హీరో అనే ఇమేజ్ తోనే కార్తికేయ టాలీవుడ్ లో మీడియాలో పాపులర్ అవుతున్నాడు.ఇదిలా ఉంటే రీసెంట్ గా కార్తికేయ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో చావు కబురు చల్లగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.
ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.దీంతో పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాలేదు.
గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో ఇదే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ అనే టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందనే విషయాన్ని కార్తికేయ కూడా నేరుగా సోషల్ మీడియా ద్వారా ఒప్పుకొని ప్రేక్షకులకి సారీ చెప్పాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఒటీటీలోకి రాబోతుంది.ఆహా ఒటీటీ ద్వారానే ఈ సినిమాని డిజిటల్ ప్రేక్షకుల కోసం అందుబాటులోకి తీసుకొని రాబోతున్నారు.ఈ విషయాన్ని ఆహా ఒటీటీ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.ఏప్రిల్ 23న ఈ సినిమా ఆహా ద్వారా డిజిటల్ ప్రీమియర్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
ఇదిలా ఉంటే కార్తికేయ ప్రస్తుతం కోలీవుడ్ లో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వాలిమై షూటింగ్ లో జాయిన్ అయినట్లు తెలుస్తుంది.దీంతో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నాడు.
అయితే అది ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది వేచి చూడాలి.