తెలంగాణాలో పోలింగ్ తేదీ రోజున ప్రభుత్వ … ప్రవేటు సంస్థలన్నీ విధిగా సెలవు ఇవ్వాల్సిందే అంటూ… తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్ కుమార్ స్పష్టం చేశారు.ఈ మేరకు కార్మిక శాఖ కమిషనర్కు ఆయన గురువారం (నవంబర్ 29) ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే, తమకు ఆ రోజు సెలవు ప్రకటించడంలేదని పలు ప్రైవేట్ కంపెనీలు, ఐటీ కంపెనీల ఉద్యోగులు ఈసీకి ఫిర్యాదు చేశారు.దీంతో సీఈవో స్పందించారు.డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ రోజున ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటించింది.