ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే.ఇక అగ్రరాజ్యమైన అమెరికా లో మహమ్మారి వైరస్ విజృంభణ గురించి ఎంత చెప్పినా తక్కువే.
రోజురోజుకు నమోదవుతున్న కేసులతో అసలు అమెరికా పరిస్థితి భవిష్యత్తుతో ఎలా ఉంటుంది అన్నది ఊహకందని విధంగా ఉన్నది.అమెరికాలో ఈ వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఎంతో మంది ప్రముఖులు వైరస్ గురించి అవగాహన కల్పించడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలందరికీ సూచిస్తున్న విషయం తెలిసిందే.
ఇక విజృంభిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ పై స్పందించిన ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ ఆయన సతీమణి తో కలిసి సోషల్ మీడియా వేదికగా ప్రజలందరికీ ఒక ఆసక్తికర రిక్వెస్ట్ చేశారు.జుకర్ బర్గ్ ఆయన భార్య మాస్కు ధరించి ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తూ… అందరూ మాస్క్ ధరించండి అంటూ రిక్వెస్ట్ చేశారు.
దయచేసి అందరూ మాస్కులు ధరించండి.అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తుంది దేశంలో ఆంక్షలు విధించకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా మాస్క్ ఎంతగానో సహాయం చేస్తుంది అంటూ ఫేస్ బుక్ సీఈఓ జుకర్బర్గ్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారిపోయింది.ఇక ఇప్పుడు వరకు అమెరికాలో ఇరవై ఏడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే.