త్వరలో దేశవ్యాప్తంగా రైతులకు శుభవార్త చెప్పేందుకు కేంద్ర అధికార పార్టీ బీజేపీ సిద్ధం అవుతోంది.దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తుండడంతో ఆలోచనలో పడ్డ మోదీ సర్కార్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతు రుణాలను మాఫీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.ఇప్పటికే… రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, తెలంగాణా శాసన సభల ఎన్నికల్లో బీజేపీకి పరాజయం ఎదురవడంతో మిగతా రాష్ట్రాల్లో ఈ ప్రభావం పడకుండా బీజేపీ పరపతి పెరిగేలా మోదీ ప్రభుత్వం ఈ ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది.
మరో నాలుగు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగాల్సి ఉండడం…సమయం తక్కువగా ఉండటంతో రుణ మాఫీని ప్రకటించడమే ఏకైక మార్గమని కొందరు నిపుణులు మోదీకి సలహా ఇచ్చినట్లు తెల్సుస్తోంది.ఇదే కనుక అమలు అయితే కొంతమేర రైతులకు కష్టాలు తప్పినట్టే.
తాజా వార్తలు