కేంద్రాన్ని నడుపుతున్నది రాజకీయ పార్టీ కాదు ఒక కంపెనీ అని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయుత్ అన్నారు.అందుకే రైతు ప్రతినిధులను చర్చలకు పిలవడం లేదని ఆయన విమర్శించారు.
హర్యానాలోని రోహ్ టక్ లో ఆదివారం మీడియాతో మాట్లాడిన తికాయిత్ నూతన సాగు చటాలని రద్దు చేసేది లేదని కేంద్రం షరతు పెడుతూనే ఓ పక్క చర్చలకు సిద్ధం అంటున్నారు. నూతన సాగు చట్టాలని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాల్సిందే అని తన డిమాండ్ ను చెప్పారు.
చర్చలకు సిద్ధమని వ్యవసాయ మంత్రి నరేందర్ సింగ్ తోమర్ చెబుతున్నా ఐదు నెలలుగ తమకు ఎలాంటి సమాచారం లేదని ఆయన అన్నారు.
పార్లమెంట్ ను ఘొరావ్ చేసే ఆలోచన ఏమి లేదని.
కేంద్రంతో మరో విడత చర్చలపై మాట్లాడతామని ప్రభుత్వాన్ని తాము నమ్ముతామని.తమతో మాట్లాడే వ్యక్తి నిర్ణయాలు తీసుకోగలిగిన వ్యక్తి కూడా ఉండాలని అన్నారు.
ఆందోళనల ముగింపు పై రైతుల వైఖరి మరింత స్పష్టత ఇస్తూ తాము ఎక్కడికైనా వెళ్తామని చలిగాలు.మండుటెండలు.
లెక్క చేయని తమకు వర్షాకాలాన్ని ఎదుర్కునే ధైర్యం ఉందని అన్నారు తికాయిత్.కేంద్రం చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం ఆగదని అన్నారు.