టిక్ టాక్ ప్రస్తుతం ఇండియాలో ఎక్కువగా వినిపించే పేరు.యువత నుంచి పెళ్ళైన ఆడవాళ్ళ వరకు అందరూ ఈ టిక్ టాక్ యాప్ లో తన వీడియోలు షేర్ చేస్తూ అందరితో తమ సంతోషాన్ని షేర్ చేసుకుంటున్నారు.
అయితే ఈ టిక్ టాక్ యాప్ కారణంగా యువత తప్పుదారి పడుతుందని.ఎక్కువ సమయం దానిపైనే గడుపుతూ మిగిలిన విషయాలపై శ్రద్ధ చూపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అలాగే అశ్లీల వీడియోలు ఎక్కువగా అందులో పోస్ట్ అవుతున్నాయని విమర్శలు కూయా వినిపించాయి.ఈ నేపధ్యంలో టిక్ టాక్ యాప్ పై మద్రాస్ హై కోర్ట్ తమిళనాడులో నిషేధించాలని తీర్పు చెప్పింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ యాప్ ని తమ ప్లేస్టోర్ల నుండి తొలగించాలని గూగుల్, యాపిల్ సంస్థలను కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.టిక్టాక్ను నిషేధించాలని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన మరుసటి రోజే ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ నెల మూడున దేశవ్యాప్తంగా టిక్టాక్ డౌన్లోడ్పై ఆంక్షలు విధించాలని మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.
క్రింది కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యం లో పిటిషన్పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.ఈ నేపధ్యంలో టిక్ టాక్ పై నిషేధిమ విధించక తప్పలేదు.
.