దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.కశ్మీర్, అస్సాం, ఢిల్లీ, ముంబయి వంటి ప్రాంతాల్లో ఉన్న వారిని ఇప్పటికే గుర్తించి పంపించిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్పై దృష్టి పెట్టినట్లుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న పార్లమెంటులో ప్రకటించాడు.
హైదరాబాద్లో ఉన్న విదేశీయుల జాబితాను గుర్తించినట్లుగా ఈ సందర్బంగా ఆయన ప్రకటించాడు.దేశంలో అక్రమంగా ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా పంపించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు.
హైదరాబాద్లో ఆఫ్రికా దేశానికి చెందిన వారు వేలాది మంది ఉంటున్నారు.వారిలో కొందరికి ఆధార్ కార్డులు, హైదరాబాద్లో సొంత ఆస్తులు కూడా ఉన్నాయి.అందుకే వారిని పంపించడం కష్టం అంటూ ఇన్ని రోజుల నుండి భావన ఉంది.కాని కేంద్రం తీసుకున్న కొత్త నిర్ణయంతో వారు ఎలాంటి అనుమతి లేకుండా ఇండియాలోకి రావడంతో పాటు ఇండియాలో ఉంటున్న కారణంగా వారిని పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దాదాపుగా పదివేల మంది హైదరాబాద్లో వివిద దేశాలకు చెందిన వారు అక్రమంగా ఉంటున్నట్లుగా ఒక రిపోర్ట్లో వెళ్లడయ్యిందట.