ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం కారణంగా విద్యా సంస్థలన్నీ మూతపడిన విషయం తెలిసిందే.దాదాపు మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య ఇప్పట్లో విద్యా సంస్థలు తెరుచుకునే అవకాశం కూడా లేదు.ఈ క్రమంలోనే ఆన్లైన్ విద్య కు ఎంతో ప్రాధాన్యత పెరిగింది అన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆన్లైన్ విద్యను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు డిజిటల్ విద్యకు సంబంధించి సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్రం నిర్ణయం కీలకం గా మారిపోయింది.
ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు అందరికీ 15 వేల విలువచేసే సాంకేతిక పరికరాలను అందించేందుకు మానవవనరుల అభివృద్ధి శాఖ ప్రతిపాదన తీసుకొచ్చింది.
దీని కోసం వచ్చే ఐదేళ్ల కాలని 60 వేల కోట్లను కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి కేంద్రం ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సరికొత్త ప్రతిపాదనల్లో 36473 కోట్ల కేంద్రం వాటా ఉండగా.మిగిలిన రాష్ట్రాలు మిగతా మొత్తాన్ని భరించాల్సి వస్తుంది.ఈ పథకం ద్వారా నాలుగు కోట్ల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది, ఈ క్రమంలోనే 1.5 కోట్ల మంది విద్యార్థులకు లాప్టాప్ లు అందించేందుకు నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తోంది.