కరోనా వైరస్.ఆర్ధికంగా స్థిరంగా ఉన్న వారే కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయారు.అలాంటిది మధ్య తరగతి వారు.వలస కూలీలు, చిన్న వ్యాపారాలు ఈ కరోనా కారణంగా ఇంకా ఎంత నష్టపోయి ఉండాలి.అలా నష్టపోయి.కనీసం కడుపుకు తిండి లేక ఎంతోమంది ప్రజలు ఆకలితో మరణిస్తున్నారు.
ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా కాలంలో పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.పేదలకు సులభంగా రుణాలు ఇప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.ఇందుకు సంబంధించి త్వరలోనే ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ఆర్బీఐ నుంచి సులభంగా అనుమతులు పొందేలా ఒక నూతన పాలసీని ప్రవేశబెట్టనున్నట్టు ఆయన తెలిపారు.
పేదలకు చిన్న మొత్తంలో రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది.తక్కువ సమయంలోనే ఎంతో సులభంగా రుణాలు ఇవ్వాలంటూ ఓ కంప్యూటరైజ్ద్ వ్యవస్థ అవసరమవుతుందని దానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.