వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్ వినియోగంపై కేంద్రం ప్రభుత్వ అధికారులకు సూచనలు చేసింది.ఇటువంటి యాప్ లలో ఎటువంటి కీలక సమాచారం పంపుకోవద్దని కేంద్రం ప్రభుత్వ అధికారులను కేంద్రం ఆదేశించింది.
ఈ యాప్స్ కి సంబంధించిన సర్వర్లు ఇతర దేశాల్లో ఉండడం వలన.ఏదైనా కీలక సమాచారం పంపితే అది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అధికారులకు హెచ్చరించింది.ప్రభుత్వ అధికారులు కేవలం ఈ-ఆఫీస్ అప్లికేషన్లనే వాడాలని తెలిపింది.అంతేకాక.మీటింగ్ లకు సంబంధించి గూగుల్ మీట్, జూమ్ లను వాడొద్దని.వాటి స్థానంలో NIC, C-DAC యాప్ లను వాడాలని సూచించింది.
రహస్య సమాచారం లీక్లను తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి శాఖ కేంద్రం చెప్పిన ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కేంద్రం కోరింది.
సర్వర్లు ప్రయివేటు యాజమాన్యానికి సంబంధించినవి కావున.ఏదైనా ముఖ్యమైన పత్రాలను అధికారులు తమ మొబైల్ సెట్లలో స్టోర్ చేయకూడదని తెలిపారు.
కీలక సమాచారాన్ని ఏదైనా మొబైల్ ద్వారా ఏ ఇతర అధికారులతోనూ షేర్ చేయకూడదని కేంద్ర వర్గాలు చెప్పాయి.ఈ కొత్త కమ్యూనికేషన్ నిబంధనలు, అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చేరవేయబడ్డాయి.
అంతేకాక.జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యలను మాట్లాడుకునే సమావేశంలో ఎవరూ కూడా స్మార్ట్ వాచ్లు కానీ.
ఫోన్లు కానీ వాడొద్దని అధికారులను కేంద్రం కోరింది.
ఇక మీటింగ్ లను కూడా ప్రైవేట్ యాప్స్ అయిన గూగుల్ మీట్ మరియు జూమ్ యాప్ లను వాడొద్దని కోరింది.వాటికి బదులుగా C-DAC, NIC రూపొందించిన యాప్ లను వాడాలని సూచించింది.వాటికి కూడా కచ్చితంగా పాస్వర్డ్ పెట్టుకోవాలని తెలిపింది.
చాట్ రూమ్, వెయిటింగ్ ఫెసిలిటీస్ యాక్సెస్ చేయాలంటే పాస్వర్డ్ తప్పనిసరని కేంద్రం ఉన్నతాధికారులకు చెప్పింది.