ప్రస్తుతం సమాజంలో చాలా మందికి కారు ఉండే ఉంటుంది.అయితే మీ ప్రయాణం ఎక్కువగా హైవేఫైనే చేస్తుంటారా.? అయితే ఈ విషయం తప్పని సరిగా తెలుసుకోవాల్సిందే.తాజాగా కేంద్ర ప్రభుత్వం టోల్ ట్యాక్స్ రూల్స్ మార్పులు తీసుకొచ్చింది.
ఇక ఆన్ లైన్ లావాదేవీలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అయితే హైవే పైన ప్రయాణం చేసే వాహనదారులు కచ్చితంగా ఫాస్టాగ్ తీసుకోవాలని అన్నారు.
ఒకవేళ ఫాస్టాగ్ తీసుకోకుంటే టోల్ ప్లాజాల వద్ద పొందే డిస్కౌంట్లు పొందలేరని నిపుణులు వెల్లడించారు.అయితే ఫాస్టాగ్స్ ను కలిగిన వాహనదారులకు మోదీ ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అదేంటి అంటే టోల్ ట్యాక్స్ రిబేట్.అంటే హైవే పైన 24గంటల్లో వెళ్లి మళ్లీ తిరిగి వచ్చిన వారికి ఇది ఊయాయోగపడుతుంది.
ఇది కేవలం ఫాస్టాగ్ కలిగి ఉన్న వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం తెలియజేసింది.
ఇక రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన విషయం గురించి చర్చించారు.అంతేకాకుండా దీనికి సంబంధించిన గెజిటెడ్ నోటిఫికేషన్ ను ఆగస్టు 24న విడుదల చేశారు.ఇక నేషనల్ హైవేస్ టోల్ ప్లాజ్లాల వద్ద డిస్కౌంట్ కావాలని అనుకునే వారు కచ్చితంగా ఫాస్టాగ్ కలిగి ఉండాలని పేర్కొన్నారు.
అంతేకాక ఫాస్టాగ్ పొందిన వారికీ తిరుగు ప్రయాణంలో ఫీజు తగ్గింపు పొందే అవకాశాన్ని పొందవచ్చని తెలిపారు.ఇక కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్స్ ను తప్పనిసరి అని చెప్పిన సంగతి విదితమే.