తెలంగాణ రాష్ట్రంలోని రెండు రహదారుల్ని జాతీయ రహదారులుగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా గెజిట్ విడుదల చేసింది.ఈ రెండు లాంగ్ రూట్స్ జాతీయ రహదారులుగా మారడం వల్ల రాష్ట్రంలో అత్యధిక ప్రాంతానికి కనెక్షన్ ఏర్పడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారట.
ఇకపోతే నేషనల్ హైవేలుగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన రహదారుల వివరాలు తెలుసుకుంటే.NH-167 పై మహబూబ్ నగర్ నుంచి కొడంగల్, తాండూరు, కర్ణాటకలోని చించొలీ ద్వారా కర్ణాటకలోని బాపూర్ జంక్షన్ తో అనుసంధానం చేస్తున్న ఈ రోడ్డుకు జాతీయ రహదారి నంబర్ 167-N గా ప్రకటించింది.
అలాగే NH-30 పై కొత్తగూడెం నుంచి ఇల్లందు, మహబూబాబాద్, నెల్లికుదురు, తొర్రూరు, వలిగొండ ద్వారా వెళ్తూ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గౌరెల్లి దగ్గర కనెక్ట్ అయ్యే రహదారికి కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ ఎన్ హెచ్-930 P గా ప్రకటించింది.ఇలా తెలంగాణలోని రెండు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించినం