పుల్వామాలో ఉగ్ర దాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే.మరోవైపు ఉగ్రవాదులపై, ఉగ్రవాదాన్ని భారత్పై ప్రేరేపిస్తున్న పాకిస్థాన్పై వెంటనే యాక్షన్ తీసుకోవాలని దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఒకే మాటగా వినిపిస్తుంది.
ఇక రక్షణ దళాలు కూడా తమ సోదరులను పోగొట్టుకొని ప్రతీకార చర్య కోసం ఎదురుచూస్తున్నాయి.ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ఉగ్ర దాడికి వ్యతిరేకంగా ప్రతీకార చర్యలు కోసం ఎలాంటి ప్లాన్ చేయాలి అనే దానిపై అక్షంత లతో కలిసి చర్చించడం జరిగింది.
ఆపై ఈరోజు అఖిలపక్ష భేటీలో ఉగ్ర దాడికి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలపై యాక్షన్ ప్లాన్ అన్ని పార్టీల నాయకులకు చేయడానికి సిద్ధమవుతున్నారు.ఇప్పటికే ప్రతిపక్ష కాంగ్రెస్ అధినేత రాహుల్ కూడా ఉగ్రవాదులపై వ్యతిరేకంగా తీసుకునే చర్యలు పూర్తి మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ రక్షణ తరాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి యాక్షన్ ప్లాన్ అమలు చేయమని చెప్పినట్లు సమాచారం.ఇక రక్షణ దళాలు కూడా ఏ క్షణమైనా ఉగ్రవాద సంస్థలపై దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.అదే సమయంలో పాకిస్తాన్ సైనిక స్థావరాలపై కూడా సర్జికల్ స్ట్రైక్ తరహాలో దాడి చేయాలని హోంశాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.మరి 40 మంది జవాన్ల వీరమరణానికి ప్రతీకారంగా ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అలాగే ఈ ఉగ్రదాడి ఎవరు సహకరించారు ఎలా జరిగింది అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం రక్షణ శాఖ అధికారులు చేస్తున్నారు.