రైతులకు శుభవార్త తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. !

కరోనా విపత్తు కాలంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ తీపి కబురు అందించింది.పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన పథకం కింద 8వ విడత డబ్బులను పంపిణి చేస్తున్నట్లుగా తెలిపింది.

 Central Government Gives Good News To Farmers Central Government, Good News, Far-TeluguStop.com

కాగా కేంద్రం ఇప్పటికే ఏడు విడతల్లో డబ్బులను రైతులకు ఖాతాల్లో వేసింది.ఇప్పుడు 8వ విడత డబ్బులు రైతులకు రావాల్సి ఉన్న క్రమంలో ఈ డబ్బులను మే 14వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.,/br>

ఇకపోతే పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రైతులకు రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే.ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది.అయితే రైతులు పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డబ్బులు వచ్చాయా లేదా అనే విషయాన్ని ఎలా చెక్‌ చేసుకోవచ్చునో తెలుసుకుంటే.

ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmksan.gov.in/ ను సందర్శించాలి ఆ తర్వాత కార్నర్ సెక్షన్ లో కనిపించే బెనిఫీసియరీ లిస్ట్ పై క్లిక్ చేసి రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలను ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలని అధికారులు తెలియచేస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube