భారత్ లో కరోనా నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం సిద్దం అవ్వుతుంది.ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకాలు తయారుచేసిన కోవిషీల్డ్ టీకాను అత్యవసర వినియోగానికి ఉపయోగించవచ్చని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ప్రతినిధుల బృందం నిన్న శుక్రవారం నాడు సమావేశమై సుధీర్ఘంగా చర్చించి ఆ తర్వాతనే కోవిషీల్డ్ టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ టీకాను పుణె కు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తుంది.
ఈ మేరకు నిపుణుల కమిటీ అత్యవసర వినియోగానికి కోవిషీల్డ్ టీకాను ఉపయోగించవచ్చని భారత్ ఔషధ నియంత్రణ సంస్థకు సిఫార్సు చేసింది.
ఇక ఫైజర్ టీకాను నిల్వ చెయ్యడానికి సుమారు మైనస్ 80 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం అవ్వుతుంది.ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది.అదే కోవిషీల్డ్ టీకాను నిల్వ చెయ్యడానికి సుమారుగా మైనస్ 2 నుండి 8 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం.దీనిని చాలా సులభంగా నిల్వచేయ్యవచ్చు.
భారత్ బయో టెక్ తయారుచేసిన కొవ్యాగ్జిన్ టీకాను అత్యవసర వినియోగానికి చేసుకున్న ధరఖాస్తుపై త్వరలో ఓ నిర్ణయం తీసుకొనున్నారు.
.