కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసే వారికి, చేసిన వారికి శుభవార్త.పెన్షన్ కోసం ఇక నుండి విసిగిపోవలసిన అవసరం లేదట.
ఇంట్లో నుంచే ఒక్క చిన్న క్లిక్తో పెన్షనర్లు పీపీఓను ప్రింట్ తీసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం తెలియ చేస్తుంది.
కోవిడ్ మహమ్మారి సమయంలో ఇ-పిపిఓను అభివృద్ధి చేసి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా చేసిన అధికారులను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా అభినందించారు.
ఇకపోతే ఉద్యోగ పదవీ విరమణ చేసిన వారికి లేదా, ప్రభుత్వం పెన్షన్ పెంచిన వారికి పీపీవో అవసరం అవుతుంది.
ఇలాంటి వారందరు ఆన్లైన్లోనే పీపీవో డౌన్లోడ్ చేసుకోవడం వల్ల పెన్షన్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొరని పేర్కొన్నారు.
ఇక లాక్ డౌన్లో పదవీ విరమణ చేసిన వారికి ఈ సర్వీసుల వల్ల చాలా లాభం కలుగనుంది అని మంత్రి వెల్లడించారు.ఏదైతేనేమి మొత్తానికి పెన్షన్ దారుల సమస్య చాలా వరకు పరిష్కరంచబడటం ఉద్యోగ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్న సిటిజన్స్కు ఆనందకర విషయమే అని అనుకుంటున్నారట.