దేశవ్యాప్తంగా 25 వేల మొబైల్ టవర్ల ఏర్పాటుకు కావాల్సిన నిధులను మంజూరు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.ఈ మేరకు రూ.26 వేల కోట్లను మంజూరు చేయనుంది.ఈ విషయాన్ని రాష్ట్రాల ఐటి మంత్రుల డిజిటల్ ఇండియా సమావేశంలో కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు.
అయితే, భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ ఈ టవర్ల ప్రక్రియను చేపట్టనుంది.కాగా వచ్చే 500 రోజుల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు.ఐటీ మంత్రుల సమావేశంలో ఏపీ, తెలంగాణ ఐటీ శాఖల మంత్రులు కూడా పాల్గొన్నారు.