తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి జాతీయ అవార్డు వచ్చిందంటూ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పథకానికి జాతీయ అవార్డుపై కేంద్ర సర్కార్ షాకిచ్చింది.
మిషన్ భగీరథ పథకానికి అసలు అవార్డు రాలేదని తేల్చి చెప్పింది.పథకాన్ని కేంద్రం అసలు అంచనా వేయలేదని కేంద్రం జలశక్తి శాఖ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో వంద శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రం ధృవీకరించలేదని వెల్లడించింది.రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే వంద శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చామని తెలిపిందని పేర్కొంది.
అనంతరం గ్రామీణ నీటి సరఫరా విభాగంలో మాత్రమే తెలంగాణకు అవార్డు వచ్చిందని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది.