దేశంలో కరోనా విజృభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ప్రస్తుత తరుణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.
అంతేకాకుండా ఈ క్లిష్ట పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందించిన కరోనా వారియర్స్ని ఆగస్టు15న నిర్వహించే స్వాతంత్ర్య వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తెలియజేసింది.
అయితే రాష్ట్ర రాజధాని ప్రాంతాల్లో ఉదయం 9 గంటలకు వేడుకలను నిర్వహించాలని కోరారు.
కరోనా దృష్ట్యా భారీ స్థాయిలో జనం వేడుకల్లో పాల్గొనకుండా చూడాలని అన్ని రాష్ట్రాలకు తెలియజేశారు.స్వాతంత్ర్య వేడుకల్లో మార్చ్ఫాస్ట్ నిర్వహించే పోలీసు, ఆర్మీ, పారామిలటరీ, ఎన్సీసీ దళాలు మాస్క్ ధరించాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఎర్రకోట వద్ద నిర్వహించే వేడుకలను కూడా పరిమితంగా నిర్వహించాలని కేంద్రం ఆలోచిస్తుంది.ఈ వేడుకలకు హాజరయ్యే వీవీఐపీలు కేవలం 20 శాతం మంది మాత్రమే హాజరు అవుతారని తెలిపారు.
ఈ వేడుకలకు విద్యార్ధులు గాని స్థానిక పిల్లలుగాని ఎవరూ హాజరయ్యే అవకాశం లేదని అర్ధం అవుతుంది.
ఈ వేడుకలకు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ క్యాడెట్లు హాజరవుతారని తెలుస్తుంది.
ఇక కరోనా విజేతలు 1500 మంది ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.స్థానిక పోలీసులు 500 మంది ఉంటారు అని వివిధ ప్రాంతాలకు చెందిన వెయ్యి మంది ఉంటారని సమాచారం.
ఇంకా మొత్తంగా ఈ వేడుకలకు 2 వేల మంది లోపే ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.