పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై కేంద్రం స్పష్టత ఇచ్చింది.వైసీపీ ఎంపీ వంగా గీత ప్రశ్నకు లోక్ సభలో కేంద్రం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతున్నందున కేంద్రం నేరుగా నగదు బదిలీ చేయడం కుదరదని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది.ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.
పోలవరం నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చును ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తున్నామని వెల్లడించింది.