మీకు ఆధార్ కార్డు ఉన్నటైతే మీరు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి.ఆధార్ చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి.
మన సమాచారం మొత్తం ఆధార్ కార్డులో నిక్షిప్తమై ఉంటుంది.అందువల్ల ఆధార్ కార్డుతో జాగ్రత్తగా ఉండాలి.
ఆధార్ కార్డును వాడేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.ఇందుకోసం యూఐడీఏఐ అందర్నీ అలర్ట్ చేస్తోంది.
యూఐడీఎఐ ఆధార్ కార్డు యొక్క యూజర్లకు హెచ్చరిక చేస్తోంది.పాన్ కార్డు, రేషన్ కార్డు లాగానే ఆధార్ కార్డు అందరికీ ఎంతో కీలకమైన డాక్యుమెంట్ అని చెప్పుకోవచ్చు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఎన్నో సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందాలంటే కచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఉండి తీరాలి.ఆధార్ కార్డు వలన ఎన్నో రకాల ప్రయోజనాలు అనేవి ఉన్నాయి.
వాటికి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అందుకే దానిని వాడుకోని చాలా మంది ఆధార్ కార్డు మోసాలకు పాల్పడుతున్నారు.
ఈ మధ్య అటువంటి మోసాలు పెరిగిపోతున్నాయి.
ఆధార్ కార్డు ఉన్నవారు అంతా కూడా చాలా అలర్ట్ గా ఉండాలని యూఐడీఏఐ హెచ్చరికలు జారీ చేసింది.
ఎవరి ఆధార్ నెంబర్లను కూడా వెరిఫై చేయకుండా ఐడెంటిటీ ప్రూఫ్ గా పరిగణనలోకి తీసుకోవద్దని సూచనలు జారీ చేసింది.ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకున్నాకనే దానిని వినియోగించాలని సూచిస్తోంది.
ఆఫ్లైన్ లో అయితే ఆధార్ కార్డుపై క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి.ఆధార్ కార్డు విషయంలో యూఐడీఏఐ తమ అధికారిక ట్విట్టర్ వేదికగా ఆధార్ యూజర్లకు తగిన జాగ్రత్తలు తెలియజేసింది.
ప్రతిఒక్కరూ కూడా తప్పనిసరిగా ఆధార్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరింది.ఆధార్ కార్డు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ వెరిఫికేషన్ టైంలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని హెచ్చరించింది.ఆన్లైన్ లో ఆధార్ https://resident.uidai.gov.in/verify ద్వారా మాత్రమే వెరిఫై చేసుకోవాలని ఆధార్ యూజర్లను హెచ్చరించింది.