తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం వివాదాలకి కేంద్ర బిందువుగా మారి, తెలుగు దేశం పార్టీ శ్రేణులని టెన్సన్ పెట్టిన ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి సెన్సార్ బోర్డ్ బ్రేక్స్ వేసింది.ఈ నెల 22న రిలీజ్ కి రెడీ చేసిన ఆర్జీవి తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాల కోసం వెయిట్ చేస్తున్నాడు.
అయితే ప్రస్తుతం ఎన్నికల నేపధ్యంలో తెలుగు దేశం పార్టీని, చంద్రబాబు నాయుడుని కించపరిచే విధంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉందని, దీనిని నిలిపేయాలని తెలుగు దేశం పార్టీ నాయకులు సెన్సార్ బోర్డ్ కి ఫిర్యాదు చేసారు.
అయితే ఎట్టి పరిస్థితిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ని రిలీజ్ చేస్తానని చెప్పిన వర్మ, సెన్సార్ అడ్డు పడితే యుట్యూబ్ లో రిలీజ్ చేస్తా అని ఇప్పటికే స్పష్టం చేసాడు.
ఇలాంటి పరిస్థితిలో సెన్సార్ బోర్డ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ ని అనుమతించలేదని తెలుస్తుంది.ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్ లో పేర్కొని, తన సినిమా రిలీజ్ కి సెన్సార్ అడ్డుపడటం సరైన నిర్ణయం కాదని అన్నారు.
మరి ఈ పరిస్థితిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కోసం ఆర్జీవి ఎలాంటి ప్లాన్ చేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.