కరోనా ఇప్పటి వరకు మిగిల్చిన విషాదం జీవితంలో మరచిపోలేము.ఎందరో మేధావులను, సెలబ్రీటీలను తన పొట్టనపెట్టుకుంది.
ఇప్పటికి కూడా శాంతించకుండా అదును చూసి బలి తీసుకుంటుంది.
ఇక సెకండ్ వేవ్ అని వస్తుంది ఈ కరోనా.
ఇది మరెంత భయభ్రాంతులకు గురిచేస్తుందో చూడాలి.ఇకపోతే ఈ కరోనా బారిన పడి మరొక ప్రముఖ సింగర్ బలి అయ్యారు.
పంజాబ్ ఫేమస్ సింగర్ శార్దూల్ సికిందర్ కరోనాతో కన్నుమూశారు.
గత కొద్ది రోజుల క్రితం కిడ్నీ సమస్యతో బాధపడుతున్న శార్దూల్ మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు.
కాగా కిడ్నీ ఆపరేషన్ జరిగినప్పటికి కరోనా సోకింది.ఈ క్రమంలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఇదిలా ఉండగా సింగర్ శార్దూల్ సికిందర్ మృతిపట్ల పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, శిరోమణి అకాలీదళ్ ప్రెసిడెంట్ సుఖ్బీర్ సింగ్ బాదల్ సంతాపం తెలిపారు.ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.