ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు.... బెంగాల్ లో ఘర్షణలు

ఏడు రాష్ట్రాల్లో మరో 59 స్థానాల కోసం ఆరో దశ పోలింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో ఏడు రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 Celebrities Vote In Bengal-TeluguStop.com

వారిలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భాజపా భోపాల్ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్,మాజీ క్రికెటర్, ఢిల్లీ తూర్పు నియోజకవర్గం భాజపా అభ్యర్థి గౌతమ్ గంబీర్ కూడా ఉన్నారు.ఇప్పటివరకుఐదు దశల్లో మొత్తం 424 స్థానాలకు పోలింగ్ ముగియగా, ఇప్పుడు తాజాగా 59 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ పోలింగ్ నేపథ్యంలో బెంగాల్ లో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.మాజీ ఐపీఎస్ అధికారి, బీజేపీ అభ్యర్థి భారతి ఘోష్ పై తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది.

దీనితో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.దీనితో అక్కడ భద్రతను మరింత పెంచినట్లు తెలుస్తుంది.వాస్తవానికి బెంగాల్ లోనే అత్యధికంగా బలగాలను మోహరించారు.అయినప్పటికీ అక్కడ హింసాత్మక ఘటనలు మాత్రం చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

ఈ క్రమంలో ఎన్నికల కమీషన్ ఈ ఘటనపై దర్యాప్తు కు ఆదేశించినట్లు తెలుస్తుంది.ఈ విధంగా పోలింగ్ సమయంలో ఘర్షణలు చోటుచేసుకోవడం కొత్తేమీ కాదు గతంలో కూడా పలు మార్లు ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

ఒక్క పశ్చిమ బెంగాల్ మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా పోలింగ్ సజావుగానే సాగుతున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube