నందమూరి బాలకృష్ణ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన సినిమా ‘అఖండ’.ఈ సినిమా మే లోనే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా షూట్ వాయిదా పడడంతో సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది.
ఇక ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఈ రోజు మన ముందుకు వచ్చింది అఖండ.చాలా రోజుల తర్వాత బాలయ్య సినిమాపై ప్రేక్షకులు భారీ హోప్స్ పెట్టుకున్నారు.
ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా పై పాజిటివ్ టాక్ వస్తుంది.అందరు పెట్టుకున్న అంచనాలను బాలయ్య, బోయపాటి వమ్ము చేయలేదు.
చాలా రోజుల తర్వాత బాలయ్య నుండి ప్రేక్షకులు ఆశించిన సినిమా రావడంతో అందరిలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.ఇక నందమూరి అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అయితే ఎప్పుడు లేని విధంగా అభిమానుల నుండి మాత్రమే కాక ఈసారి టాలీవుడ్ స్టార్స్ నుండి కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ముందుగా ప్రీమియర్ చుసిన ప్రేక్షకులు పాజిటివ్ టాక్ ఇవ్వడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
దాంతో అభిమానుల సందడి థియేటర్స్ దగ్గర మాములుగా లేదు.
ఇక స్టార్స్ కూడా సోషల్ మీడియా వేదికగా బాలయ్య అఖండ సినిమాపై స్పందించడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.బాలయ్య, బోయపాటి కాంబో హ్యాట్రిక్ హిట్ అందుకోవడంతో అందరు అభిమానందనలతో ముంచెత్తుతున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ గోపీచంద్ మలినేని, రామ్ పోతినేని, సందీప్ కిషన్, అనిల్ రావిపూడి, మంచు విష్ణు, మంచు లక్ష్మి, వెన్నెల కిషోర్, సురేందర్ రెడ్డి ఇలా ఇంకా సినీ స్టార్స్ చాలా మంది అఖండ టీమ్ కు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఇక చాలా రోజుల తర్వాత బాలయ్య బాక్సాఫీస్ దగ్గర తన మ్యాజిక్ ను చూపిస్తున్నాడు.మరి చూడాలి ఈ సునామి ఎంత వరకు వెళ్తుందో.