షార్ట్ ఫిల్మ్ తో లాక్ డౌన్ కి సెలబ్రిటీల ప్రచారం! సోషల్ మీడియాలో వైరల్

కరోనా ప్రభావంతో దేశమంతా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు.ఏప్రిల్ 14వరకు ప్రజలదరూ లాక్ డౌన్ పాటించాలని, ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వాలు స్పష్టంగా తెలియజేశాయి.

 Celebrities Short Film On Lock Down, Tollywood, Bollywood, Kollywood, Indian Cin-TeluguStop.com

ఇక ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా సెలబ్రిటీలు కూడా లాక్ డౌన్ పై ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు.ఇప్పటికి కొన్ని చోట్ల ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే కరోనా మరింతగా వ్యాపిస్తున్న వేళ లాక్ డౌన్ లో ఇంట్లో ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ స్టార్ సెలబ్రిటీలు అందరూ ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించారు.తాజాగా ఈ షార్ట్ ఫిల్మ్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

ఇప్పుడు ఒకే షార్ట్ ఫిలింలో స్టార్ లు అందరూ కనిపించడంతో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సహా ప్రియాంక చోప్రా, ఆలియా భట్, రణభీర్ కపూర్, మమ్ముట్టి, మోహన్ లాల్, తో పాటు పలువరు సెలబ్రిటీలు కలిసి ఈ షార్ట్ ఫిలిం చేశారు.

ప్రసూన్ పాండే దర్శకత్వంలో అమితాబ్ పర్యవేక్షణలో ఈ షార్ట్ ఫిలిం రూపొందించారు.ఇందులో కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఇంటిపట్టునే ఉండాల్సిన ఆవశ్యకతను, జాగ్రత్తలను ఓ చిన్న కాన్సెప్ట్ తో తెలియజేసారు.

ఈ షార్ట్ ఫిలిమ్‌కు ఫ్యామిలీ అనే టైటిల్‌ను పెట్టారు.వర్చువల్ టెక్నాలజీ ద్వారా ఈ షార్ట్ ఫిలింను రూపొందించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube