సెల్యూట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇప్పుడు ఈ హాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సోషల్ మీడియాలో సెల్యూట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటూ హాష్ ట్యాగ్ ని షేర్ చేస్తున్నారు.
ఈ రోజు ఉదయం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో టెర్రరిస్ట్ స్థావరాలపై మిరాజ్ యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్ తరహా దాడులకి పాల్పడింది.ఈ దాడిలో సుమారు మూడు వందల మంది టెర్రరిస్ట్ లు మరినిన్చినట్లు భారత రక్షణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.
ఇదిలా వుంటే తాజాగా టెర్రరిస్ట్ స్థావరాలపై భారత రక్షణ శాఖ చేసిన ఎయిర్ స్ట్రైక్ పై ట్విట్టర్ లో బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ తమ కామెంట్స్ షేర్ చేస్తున్నారు.పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ దాడికి నిజంగా దేశ ప్రజలు అందరూ గర్వకారణంగా చెప్పుకోవాల్సిన విషయం అని పొగడ్తలు కురిపిస్తున్నారు.
అలాగే సెల్యూట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటూ తమ మద్దతుని సెలబ్రిటీలు చెబుతున్నారు.