గొప్ప విషయాలు ఎవరు చెప్పిన వినడానికి బాగుంటాయి.ఇంకా జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు చెబితే ఇంకా ఎక్కువ మంది వింటారు.
అయితే ఇప్పటి వరకు ఎవరు ఎన్ని చెప్పిన కూడా వాటిని పూర్తిగా అర్ధం చేసుకునే జనాలు చాలా తక్కువ మంది ఉంటారు.అయితే ఏ విషయం అయినా షూటింగ్ చెబితే కచ్చితంగా ఎక్కువ మందికి అర్ధమవుతుంది.
ఈ విషయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎప్పుడు ముందు ఉంటాడు.మంచైనా, చెడైనా పూరీ తన సినిమాల ద్వారా యూత్ ని, ప్రజల ఆలోచనలని ప్రశ్నిస్తూ ఉంటారు.
అందుకే అతని సినిమాలు బోల్డ్ గా ఉన్న జనాలకి విపరీతంగా నచ్చుతాయి.ఇప్పుడు పూరీ ప్రజల ఆలోచనలని కొంతవారైనా ప్రభావితం చేయడానికి పూరీ మ్యూసింగ్స్ పేరుతో డిఫరెంట్ టాపిక్స్ తీసుకొని వాటిపై తన స్టైల్ లో ఆడియో ద్వారా సందేశం ఇస్తున్నాడు.
ఈ పూరీ పాడ్ కాస్ట్ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతున్నాయి.
యూత్ కి భాగా నచ్చుతున్నాయి.
ఎక్కువ మంది సోషల్ మీడియాలో వాటిని షేర్ చేస్తున్నారు.ఇక సెలబ్రిటీలు సైతం పూరీ పాడ్ కాస్ట్ ఆడియో సందేశాలకి ఫిదా అయిపోతున్నారు.
తాజాగా బన్నీ పూరీ పాడ్ కాస్ట్ వీడియోలపై ప్రశంసలు కురిపించారు.అలాగే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు కూడా పూరీ పాడ్ కాస్ట్ ఆడియో మెసేజ్ లు అద్బుతంగా ఉన్నాయని అన్నారు.
తాజాగా హీరో కార్తికేయ కూడా వీటికి ఫిదా అయిపోయాడు.తాజాగా దేశభక్తి మీద పూరీ ఒక ఆడియో బైట్ రిలీజ్ చేశాడు.
యంగ్ హీరో కార్తికేయ దీనిని సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఇప్పటికైనా పూరి మాటలు విని బుద్దితెచ్చుకోవాలని కోరారు.
దాదాపు మూడు నిమిషాల ఆ ఆడియో ఫైల్ లో దేశ పౌరుడిగా ఉంటూ మనం ఎంత బాధ్యతారాహిత్యంగా ఉంటామో పూరి విపులంగా చెప్పారు.దేశం కోసం అక్కడ సైనికులు ప్రాణాలు అర్పిస్తున్నారు, కనీసం మనం గోడపై ఉచ్చపోయడం ఆపేద్దాం.
అది కూడా దేశ భక్తే అని పూరి చెప్పారు.ఇంత వరకు మనం చేసిన వెధవ పనులు ఓ లిస్ట్ లో రాసుకుని, వాటిని మరలా చేయకుండా జాగ్రత్త తీసుకుందాం అని చెప్పారు.
ఇలా సెలబ్రిటీలు ఈ పూరీ ఆడియో బైట్ లకి ఫిదా అయిపోతూ ఉండటంతో వాటిని చూసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.