ఇన్స్ట్రాగ్రాం.ఫేస్ బుక్,వాట్సప్లతో పాటుగా వినియోగదారులను ఆకట్టుకుంటున్న సోషల్ మీడియా యాప్.వాట్సప్,ఇన్స్ట్రాగ్రాం లను ఫేస్ బుక్ కొనుక్కున్న విషయం తెలిసిందే.కాని ఇన్స్టా ఇప్పుడు ఎఫ్బీని మించిపోయింది.వాణిజ్య ప్రకటనల ద్వారా తన ఖజానా నింపుకోవడమే కాదు.వినియోగదారుల ఖాతాలలో కూడా డబ్బు జమ చేస్తుంది .ఎలా అంటారా ఇన్స్ట్రాగ్రాంలో మనకున్న ఫాలోవర్స్ సంఖ్యపై ఇది ఆధారపడి ఉంటుంది.ఇప్పుడు మన సెలబ్రిటిలు వారికున్న ఫాలోవర్స్ సంఖ్యను బట్టి లక్షలు కోట్లు గడిస్తున్నరు.ఆ స్టార్స్ ఎవరో చూడండి.
విరాట్ కోహ్లి
మనదేశంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న సెలెబ్రిటీ విరాట్ కొహ్లి.అతడు ఒక్క పోస్టు పెట్టినా, క్షణాల్లో మూడున్నర కోట్ల రూపాయలు వచ్చిపడతాయ్.విరాట్కు ఇన్స్టాలో రెండు కోట్ల ముప్పై లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ప్రియాంక చోప్రా
ప్రియాంక ఇప్పుడు ఇంటర్నేషనల్ సెలబ్రిటి .హాలీవుడ్, బాలీవుడ్ల మధ్య చక్కర్లు కొడుతోంది.ఈమెకు ఇన్స్టాగ్రామ్లో రెండున్నర కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.తను పోస్టు పెడితే, పన్నెండు లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలో పడిపోతాయి.
సోనాక్షిసిన్హా
‘దబాంగ్’ పిల్ల సోనాక్షి ,ఆ సినిమా తర్వాత జోరు తగ్గిన విషయం తెలిసిందే.కాని సామాజిక మాధ్యమాల్లో మాత్రం చురుగ్గా ఉంటోంది.మంచిమంచి ఫోటోలు పెడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.సోనాక్షికి ఇన్స్టాగ్రామ్లో కోటీ ఏడు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.ప్రతి పోస్టుకూ నాలుగు నుంచి అయిదు లక్షల రూపాయలు అందుకుంటోంది.
యువరాజ్ సింగ్
క్యాన్సర్ను జయించిన వీరుడు యువీ.వ్యాధి నుంచి బయటపడ్డాక దూకుడు పెంచి మరీ ఆడాడు.ఇతనికి ఇన్స్టాగ్రామ్లో యాభై రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.ఒక పోస్టుకు లక్ష నుంచి అయిదు లక్షల దాకా అందుకుంటున్నట్టు అంచనా.
షాహిద్ కపూర్
‘పద్మావత్’తో అతడి అభిమానుల సంఖ్య మరింతగా పెరిగిపోయింది.రాజా రతన్సింగ్గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు షాహిద్ కపూర్.ఇన్స్టాగ్రామ్లో షాహిద్కు కోటీ నలభై లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.ప్రతి పోస్టుకు ఎంత లేదన్నా పది నుంచి పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాడు.
నేహా ధూపియా
ఈ మాజీ మిస్ ఇండియా ప్రస్తుతం టాక్ షోల వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.ఈమెకు ఇన్స్టాగ్రామ్లో 22 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.నేహా పోస్టు ధర… లక్ష నుంచి అయిదు లక్షలు.కంటెంట్ కూడా తనంత స్పైసీగానే ఉంటుంది.
ప్రియా ప్రకాశ్ వారియర్
కన్నుగీటి యువ ప్రపంచాన్ని కనికట్టు చేసింది మలయాళ కుట్టి ప్రియా.రాత్రికిరాత్రే సెలబ్రిటీల సరసన చేరిపోయింది కూడా.దాంతోపాటే, బాలీవుడ్ స్టార్లను మించిన క్రేజ్ సొంతం చేసుకుంది.ఈ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో అరవై రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.ఒక పోస్టుకు ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తోంది.
సెలెనా గొమేజ్
ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రపంచంలోనే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న మహిళా సెలెబ్రిటీ ఈమె.దాదాపు పన్నెండు కోట్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.ఒక్కో పోస్టుకు సెలీనాకు దక్కే మొత్తం మూడున్నర కోట్ల పైమాటే.
.