టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ కుమార్తె ఫాతిమా వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.నిన్న హైదరాబాదులోని ఓ ఫంక్షన్ హాల్ లో ఫాతిమా వివాహం కన్నుల పండుగగా జరిగింది.
గత కొన్ని రోజుల నుంచి ఆలీ ఇంట పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను వీడియోలను తన భార్య జుబేదా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈ క్రమంలోనే తాజాగా అలీ కుమార్తె వివాహం కూడా ఘనంగా జరగడంతో ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే అలీ జుబేదా దంపతులిద్దరూ కూడా ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులను తమ కుమార్తె వివాహానికి రావాలని స్వయంగా వెళ్లి ఆహ్వానించారు.ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి దంపతులు అలాగే నాగార్జున అమల కూడా అలీ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇక సినీనటి ఏపీ మినిస్టర్ రోజా కూడా ఈ వివాహానికి హాజరై సందడి చేశారు.మొత్తానికి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు, బంధుమిత్రుల సమక్షంలో అలీ కుమార్తె వివాహం ఎంతో ఘనంగా జరిగింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అలీ కుమార్తె మెడిసిన్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.అలాగే తన అల్లుడు కూడా డాక్టర్ కావడం విశేషం.
ఇలా వీరి పెళ్లి ఫోటోలు వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు ఈ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.