కొంతమంది కేటుగాళ్లు తమకి పెద్దవాళ్లతో పరిచయాలు ఉన్నాయని నమ్మబలికి సామాన్య, మధ్యతరగతి ప్రజలని మోసం చేస్తూ ఉంటారు.ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతో వారి నుంచి చిన్న మొత్తాలు తీసుకొని పెద్ద మొత్తం ఆశచూపిస్తారు.
తరువాత ప్రజలు బాగా నమ్మి ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ సొమ్ముతో ఉడాయిస్తారు.సొసైటీలో ఇలాంటి మోసాలు రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి.
ఇలాంటి వారిని అరెస్ట్ చేసిన సంవత్సరాల తరబడి కేసులు నడుస్తూ ఉంటాయి.వాళ్ళు బెయిల్ పై బయటకొచ్చి తిరుగుతూ ఉంటారు.
లక్షలు చెల్లించిన బాధితులకి ఎప్పటికి న్యాయం జరగదు.కొంతకాలం వారు కాళ్ళు అరిగేలా తిరుగుతారు.
తరువాత మన కర్మకి ఇంతే అని వదిలేస్తారు.కొంత మంది అయితే ఫేక్ డాకుమెంట్స్ పెట్టి బ్యాంకులని సైతం చీట్ చేస్తారు.
తాజాగా అలాంటి మోసగాడు ఒకడు బెంగుళూరులో పోలీసులకి చిక్కాడు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కి చెందిన ఓ నాయకుడు యువరాజ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
బీజేపీ పెద్దల పేర్లు చెప్పుకొని ఇతను పలు మోసాలకు పాల్పడ్డాడు.కోట్ల రూపాయలు నగదుని దోచేశాడు.
ఇతన్ని అరెస్ట్ చేసిన విచారించగా అందులోకి కన్నడ స్టార్ హీరోయిన్ రాధికా కుమారస్వామి పేరు వచ్చి చేరింది.ఆమె చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చింది.
ఇప్పుడు ఆ చీటర్ యువరాజ్ బ్యాంకు ఖాతా నుంచి రాధికా కుమారస్వామితో పాటు మరో నిర్మాతకి కోటి రూపాయిల వరకు బదిలీ అయ్యాయి.ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆమెని కూడా విచారణకి రావాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తుంది.
అయితే తనకి యువరాజ్ నుంచి 15 లక్షలు సినిమా అడ్వాన్స్ రూపంలో వచ్చిందని, అంతకు మించి తనకి అతనితో ఎలాంటి సంబంధం లేదని రాధికా కుమారస్వామి పోలీసులకి తెలియజేసినట్లు సమాచారం.