టీడీపీ కార్యకర్తల దాడి...పరిస్థితి ఉద్రిక్తత!!!

కంచే చేను మేస్తే!! అన్నట్లు తయారయింది ప్రస్తుత ప్రభుత్వ పాలనా వ్యవహారం.క్రమశిక్షణకు తమ పార్టీ.

 Cc Camera Issue In Nagari Municipality-TeluguStop.com

తమ కార్యకర్తలు కేర్ ఆఫ్ అడ్రెస్ అంటూ పలికే చంద్రన్న ఇప్పుడు ఈ సంఘటన పై ఏమంటాడో చూడాలి.వివరాల్ళోకి వెళితే చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కార్యాలయంలో చిన్న సీ.సీ కెమేరాల వ్యవహారం చిలికి చికి గాలి వానగా మారి చివరకు ఉద్రిక్తతకు దారితీసింది.కొద్దిరోజుల క్రితం మున్సిపల్ చైర్మన్ శాంతికుమారి గారు నగరి మున్సిపల్ కార్యాలయంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయించారు.

అయితే వీటిని తొలగించాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు.ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం నాలుగు సిసి కెమెరాలను టిడిపి కార్యకర్తలు ధ్వంసం చేశారు.ఈ విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన మున్సిపల్ చైర్మన్ శాంతికుమారి, ఆమె భర్త కె.జి.కుమార్‌పై వారు దౌర్జన్యానికి దిగారు.వీరిని అడ్డుకునే ప్రయత్నంలో చైర్మన్ దంపతులకు గాయాలయ్యాయి.

దాడికి నిరసనగా చైర్మన్, ఆమె భర్త మరికొందరు కార్యకర్తలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపుచేశారు.

తమపై దాడికి కారణమైనవారిని వెంటనే అరెస్టు చేయాలంటు మున్సిపల్ చైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎంత అధికారం లో ఉంటే మాత్రం తాము ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటే మాత్రం రానున్న రోజుల్లో వారికి ప్రజలే బుద్ది చెబుతారు అంటున్నారు వైకాపా శ్రేణులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube