ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి లేని పోనీ తలనొప్పి ఒకటి మొదలైంది.ఎన్నికల సమయం లో సాధ్యాసాధ్యాలు కూడా ఆలోచించకుండా ఇచ్చేసిన హామీల వలన ఇప్పుడు చంద్రబాబు చాలా కష్టాలు ఎదురుకొంటున్నారు అందులో ముఖ్యంగా ‘ బాబు వస్తే జాబు ఒస్తుంది ‘ అనే వాగ్దానం నిరుద్యోగులు బాబు కి ఓటు వేసే విధంగా ప్రేరేపించింది.
మీరు ఏది అనుకుంటే అది చేస్తా, మీకు ఉద్యోగం ఇప్పించే పూచీ నాదే అంటూ చంద్రబాబు చెప్పిన కహానీలు ఇప్పుడు చెల్లుబాటు కావడం లేదు.
అధికారం లోకి ఒచ్చిన రెండేళ్ళు దాటినా ఆయన జాబుల విషయం లో సైలెంట్ గానే ఉన్నారు.
తాజాగా తిరుపతికి చెందిన యువ న్యాయవాది ఒకరు సూసైడ్ అటెమ్ట్ చేశారు.ఎందుకంటే.
బాబు వస్తే జాబు గ్యారెంటీ అన్నారని.అధికారంలోకి వచ్చి 22 నెలలు పూర్తి అయినా జాబులు వచ్చింది లేదని.
ఒకవేళ జాబు రాకున్నా.నెలకు రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారని.అలాంటిదేమీ లేకుండా తనను మోసం చేశారని ఆరోపిస్తూ ఆత్మహత్యా యత్నం చేయటం సంచలనం సృష్టించింది.