బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్ బెయిల్ రద్దుపై సీబీఐ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది.రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కుంభకోణం కేసులో తేజస్వి యాదవ్ అధికారులను బెదిరించారని సీబీఐ ఆరోపిస్తోంది.
దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ న్యాయస్థానం 20 రోజుల్లో సమాధానం చెప్పాలని తేజస్వీ యాదవ్ కు ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా తేజస్వి యాదవ్ వచ్చే నెల 18న కోర్టు ముందు హాజరు కావాలని ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది.