దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతి తర్వాత ఈ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి వైపే అందరి వేళ్లు చూపిస్తున్నారు.
ఇక శుక్రవారం సీబీఐ రియాను విచారణకు పిలవడంతో పాటు పలు ప్రశ్నలు సంధించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.తాజాగా రియా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుశాంత్ రోజూ మద్యం సేవించడంతో పాటు డ్రగ్స్ కూడా తీసుకునేవాడంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇక శుక్రవారం ముంబైలోని డీఆర్డీఓ గెస్ట్ హౌస్లో జరిగిన సీబీఐ విచారణ ఉదయం 10 గంటల నుంచి కొనసాగుతోంది.అసుల సుశాంత్తో మీకు పరిచయం ఎలా ఏర్పడింది ? మీరు ప్రేమించుకున్నారా ? సుశాంత్ బ్యాంక్ లావాదేవీల గురించి మీకు తెలుసా ? మీ ప్రేమ గురించి , సుశాంత్ కుటుంబ సభ్యులకు తెలుసా ? మీరు ఎన్ని సార్లు విదేశాలకు కలిసి వెళ్లారు ? లాక్ డౌన్ సమయంలో మీరు సుశాంత్ ఇంట్లోనే కలిసి ఉన్నది నిజమేనా ? ఇలా పలు ప్రశ్నల వర్షం సీబీఐ రియాకు సంధించినట్టు జాతీయ మీడియా చెపుతోంది.
ఈ క్రమంలోనే మీరు సుశాంత్ను పెళ్లాడాలనుకున్నారా ? అన్న ప్రశ్న కూడా వేసినట్టు తెలుస్తోంది.ఈ ప్రశ్నకు రియా కరెక్టుగా ఏమని ఆన్సర్ ఇచ్చిందో జాతీయ మీడియా చెప్పనప్పటకీ తాము ప్రేమించుకున్న మాట వాస్తవమే అని.చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నా తమ మధ్య పెద్ద గ్యాప్ ఎప్పుడూ లేదని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.ఇక రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవకర్తిని కూడా అధికారులు విచారిస్తున్నారు.
ఇక షోవిక్తో పాటు సుశాంత్ క్రియేటివ్ మేనేజర్ సిద్ధార్థ్ పితాని.వంట మనిషి నీరజ్ సింగ్ .పని మనిషి కేశ్.ఇంటి మేనేజర్ శ్యామ్యుల్ మిరిండా లను కూడా సీబీఐ విచారిస్తోంది.
మరి ఈ విచారణలో ఇంకెన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయో ? చూడాలి.