పులివెందుల మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ రెండో సారి విచారణ చేసేందుకు రెడీ అయింది.మొదటి విచారణ ముగిసిన తర్వాత దాదాపు 40 రోజుల తర్వాత విచారణ జరిపేందుకు మళ్లీ పులివెందులకు సీబీఐ చేరుకుంది.
ఢిల్లీ నుంచి పులివెందులకు చేరుకున్న సీబీఐ టీం ప్రభుత్వ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.మొదటి విచారణను జూలై నెలలో రెండు వారాల పాటు జరిపారు.
కడప, పులివెందులకు చెందిన పలువురు అనుమానితులను పట్టుకుని విచారణ జరిపిన విషయం తెలిసిందే.
వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వేసిన పిటిషన్ మేరకు సీబీఐ విచారణ చేపట్టింది.
ఈ కేసులో 15 మంది అనుమానితులున్నారని, వీరిలో కేవలం ఐదుగురిని మాత్రమే విచారణ జరిపినట్లు సీబీఐ పేర్కొంది.మిగిలిన 10 మందికి విచారణ జరిపేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసింది.
అయితే మొదటి సారిగా జరిపిన విచారణలో వివేకానందరెడ్డి కుమార్తెతో పాటు పలువురు అనుమానితులను విచారణ జరిపారు.శంకర్ రెడ్డి, సీఐ శంకరయ్య (సస్పెండ్ అయ్యాడు), పీఏ కృష్ణారెడ్డి, పని మనిషి లక్ష్మీదేవితో పాటు మరో 10 మంది అనుమానితులను విచారించారు.
జూలై 13 నుంచి జూలై 30వ తేదీ వరకు మొదటి విచారణ నిర్వహించారని, రెండోదశ విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ వెల్లడించింది.