ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నివాసం సహా ఏడు రాష్ట్రాల్లోని 21 చోట్ల సీబీఐ మెరుపు దాడులు నిర్వహిస్తుంది.ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమిషనర్ గోపీకృష్ణ నివాసంలోనూ సోదాలు చేపట్టినట్లు సమాచారం.
అయితే, సీబీఐ దాడుల గురించి డిప్యూటీ సీఎం సిసోడియా తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.దాడులు, విచారణలో అధికారులకు పూర్తగా సహకరిస్తానని తెలిపారు.
డిప్యూటీ సీఎం నివాసంలో సోదాలు నిర్వహించడం రాజధాని రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.నూతన మద్యం పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారని సిసోడియాపై ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు.
మరోవైపు ఈ విషయంపై బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.