ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా ఇటీవల వివేకానంద రెడ్డి ఇంటి వాచ్ మెన్ రంగయ్య ఇచ్చిన వాంగ్మూలంలో సరికొత్త పేరు తెరపైకి రావడంతో.
ఇద్దరు ప్రముఖుల అనే వార్తలు ఏపీ మీడియా వర్గాలలో వినిపిస్తూ ఉండటంతో కేసులో ఎటువంటి కొత్త విషయాలు బయట పడతాయో అని ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది.
సరిగ్గా ఇటువంటి తరుణంలో సీబీఐ సంచలన నిర్ణయం తీసుకుంది.విషయంలోకి వెళితే ఇప్పటివరకు ఓ మహిళ అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయడం జరిగింది.అయితే తాజాగా ఆమె ఢిల్లీ వెళ్లిపోగా ఆమె స్థానంలో కొత్త వ్యక్తిని ఎస్పీ స్థాయి అధికారి.
ఢిల్లీ నుండి ఇటీవల కడప చేరుకుని ఈ కేస్ బాధ్యతలు స్వీకరించారు.కొత్త ఆఫీసర్ కేసు మొత్తం స్టడీ చేస్తూ ఉండటంతో రెండు రోజులుగా కేసుకు సంబంధించి అనుమానితులను సీబీఐ విచారణకు పిలవటం లేదు.