సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు .ప్రచారం జరుగుతున్న సమయంలో అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
అధికారంలో టిడిపి ఉండటంతో వైసీపీ నేతలు ఇది టీడీపీ చేసిన కుట్ర ప్రభుత్వ హత్య అంటూ ఆరోపణలు చేయడం జరిగింది.ఇదే సమయంలో టిడిపి నేతలు .జగన్ కావాలని తన బాబాయ్ ని చంపించి సానుభూతి రాజకీయాలకు పాల్పడుతున్నారు సీరియస్ డైలాగులు వేశారు.
ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వం సిట్ చేత దర్యాప్తు చేయించడం జరిగింది.ఆ తర్వాత జగన్ అధికారంలోకి రావడంతో ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు బయటపడతాయి అని అందరూ భావించారు.కానీ విచారణ శ్లో గా జరుగుతూ ఉండటంతో వివేకానంద కూతురు .సునీత రెడ్డి రంగంలోకి దిగి సిబిఐ విచారణ కోరడంతో అప్పటినుండి విచారణ జరుగుతోంది.అయితే మధ్యలో రెండు సార్లు విచారణ మొత్తం జరిగిన మళ్లీ స్టార్ట్ చేయడం జరిగింది.
మధ్యలో కరోన రావడంతో .ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు కొంతమంది కరోనా బారిన పడటంతో విచారణ ఆగిపోయింది.అయితే తాజాగా ఈ కేసు విచారణ మళ్లీ స్టార్ట్ చేశారు.దీంతో కడుపులోకి సిబిఐ అధికారులు రంగంలోకి దిగి .విచారణకు ఎవరినైతే పిలవాలి అనుకుంటున్నారో వారికి నోటీసులు పంపించడం జరిగింది.
.