జనసేనలో చేరుతున్న జేడీ లక్ష్మి నారాయణ! విశాఖ నుంచి ఎంపీగా బరిలో

ఏపీ రాజకీయాలలో ఊహించని మలుపు చోటు చేసుకుంది.టీడీపీలో చేరుతారని భావించిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

 Cbi Ex Jd Lakshminarayana Confirm To Join Janasena-TeluguStop.com

ఈ విషయాన్ని అధికారికంగా ఆయన నిర్ధారించారు.జగన్ పై అవినీతి కేసుని విచారించిన లక్ష్మినారాయణ ఒక్కసారిగా ఏపీలో భాగా ఫేమస్ అయ్యారు.

అదే టైంలో ఎన్నికలకి ముందు గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రైతుల సమస్యలపై గలమెత్తిన లక్ష్మినారాయణ మీద ప్రజలలో కొంత సానుకూలత ఉంది.

ఇదిలా ఉంటే గత కొంత కాలంగా లక్ష్మినారాయణ రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలు వినిపించాయి.

ఆయన టీడీపీ పార్టీలో చేరబోతున్నారు అంటూ వార్తలు భాగా వైరల్ అయ్యాయి.అయితే ఊహించని విధంగా అతను జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు.

నిన్న రాత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చించిన గంటలో లక్ష్మి నారాయణ బయటకి వచ్చి తాను జనసేన పార్టీలో చేరబోతున్నా అనే విషయాన్ని అధికారికంగా నిర్ధారించారు.అలాగే వైజాగ్, శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడో ఒక చోట ఎంపీగా బరిలో దిగుతా అని కూడా స్పష్టత ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube