ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీబీఐ కేసులకు సంబంధించి విచారణ త్వరగా కంప్లీట్ చెయ్యాలని జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే.మొదటిసారి టెక్నికల్ తప్పులు ఉండటంతో సీబీఐ కోర్టు.
రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది.అనంతరం పిటిషన్ దాఖలు చేయగా.
విచారణకు స్వీకరించిన సీబీఐ.వైయస్ జగన్ కి అదేవిధంగా సిబిఐ కౌంటర్ దాఖలు చేయాలని గతంలో కోరింది.
అయితే ఈ విషయంలో ఇప్పటికీ జగన్ అదేవిధంగా సిబిఐ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో పాటు గడువు కావాలని న్యాయస్థానాన్ని కోరారు.
వారి విన్నపాన్ని అంగీకరించిన న్యాయస్థానం.
ఇదే చివరి అవకాశం ఈ నెల 26 వ తారీఖు లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.ఈ పరిణామంతో ఈనెలాఖరులో జగన్ బెయిల్ పిటిషన్ విషయంలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తితో ఏపీ రాజకీయాల్లో నెలకొంది.
పరిస్థితి ఇలా ఉండగా విపక్ష పార్టీలకు చెందిన నేతలు.జగన్ ఎక్కువకాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అవకాశం లేదంటూ గతంలో వ్యాఖ్యానించడం తెలిసిందే.ఇలాంటి తరుణంలో ఈ నెలాఖరున సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ కు సంబంధించి.ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.