వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే.మొదటిసారి పిటిషన్ వేసిన సమయంలో టెక్నికల్ తప్పులు ఉన్నాయని వెనక్కి పంపిన సీబీఐ తర్వాత తప్పులను సరిదిద్ది రఘురామకృష్ణంరాజు న్యాయవాదులు జగన్ బెయిల్ రద్దు దేనికి చెయ్యాలి అన్న దానిపై స్పష్టంగా వాదనలు వినిపించడం తో సీబీఐ పిటిషన్ స్వీకరించడం జరిగింది.
ఈ పరిణామంతో.పిటిషన్ ని విచారణకు స్వీకరించిన నాంపల్లి సీబీఐ కోర్టు తాజాగా సీఎం జగన్ కి అదే విధంగా సీబీఐకి నోటీసులు జారీ చేసింది.
ఈ క్రమంలో నోటీసుల్లో పొందుపరిచిన అంశాలకు వివరణ ఇవ్వాలని తెలిపింది.అంతేకాకుండా వచ్చేనెల ఏడవ తారీఖున విచారణ చేపట్టాలని నిర్ణయించడం జరిగింది.మరోపక్క బీజేపీ పార్టీకి చెందిన నేతలు జగన్.ముఖ్యమంత్రిగా రాబోయే రోజుల్లో కొనసాగటం కష్టమే అన్నట్టు కామెంట్లు చేయడం తాజాగా జగన్ కి కోర్టు నోటీసులు అందించటంతో ఈ వార్త ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.